బాబు, లోకేశ్పై ‘లాక్డౌన్’ ఉల్లంఘన కేసు
ABN , First Publish Date - 2020-06-01T08:18:48+05:30 IST
లాక్డౌన్ నిబంధనలను ఉ ల్లంఘించారంటూ మాజీ సీఎం చంద్రబాబుపై పో లీసులు కేసు నమోదు చేశారు.
నందిగామ, మే 31: లాక్డౌన్ నిబంధనలను ఉ ల్లంఘించారంటూ మాజీ సీఎం చంద్రబాబుపై పో లీసులు కేసు నమోదు చేశారు. కృష్ణాజిల్లా నందిగామ పోలీసుస్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఇటీవల హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వస్తున్న చంద్రబాబుకు అభివాదం తెలిపేందుకు పలువురు టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ వద్దకు వ చ్చారు. దీనిపై నందిగామకు చెందిన న్యాయవాది శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించటం సరికాదని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీంతో ఐపీసీ సెక్షన్ 188 కింద చంద్రబాబు, లోకేశ్ తదితరులపై కేసు నమోదు చేసినట్టు సీఐ కనకారావు తెలిపారు.