అరటి ఎగుమతుల్లో ఏపీకి అవార్డు
ABN , First Publish Date - 2020-08-22T09:28:16+05:30 IST
అరటి ఎగుమతుల్లో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్కు ‘బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అవార్డు-2020’ లభించింది.
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): అరటి ఎగుమతుల్లో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్కు ‘బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అవార్డు-2020’ లభించింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి పర్యవేక్షణలో శుక్రవారం నిర్వహించిన వర్చ్యువల్ కిసాన్ మేళాలో తమిళనాడు రాష్ట్రం థాయనుర్లోని జాతీయ అరటి పరిశోధన కేంద్రం ఈ అవార్డును రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరికి ప్రదానం చేసింది.