వైసీపీ పెద్దల ప్రోత్సాహంతోనే దాడులు
ABN , First Publish Date - 2020-09-21T08:12:27+05:30 IST
కొందరు వైసీపీ పెద్దల ప్రోత్సాహంతోనే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నట్టు అనుమానాలు ఉన్నాయని సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద
సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద
పొందూరు, సెప్టెంబరు 20: కొందరు వైసీపీ పెద్దల ప్రోత్సాహంతోనే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నట్టు అనుమానాలు ఉన్నాయని సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద ఆరోపించారు.
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గారపేటలోని ఆనందాశ్రమంలో ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు.