సీఎం పలకరు, ఆర్థిక మంత్రి దొరకరు: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2020-03-19T20:44:01+05:30 IST

వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర విమర్శలు చేశారు.

సీఎం పలకరు, ఆర్థిక మంత్రి దొరకరు: అశోక్‌బాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆర్డర్‌ను కాదని సచివాలయ ఉద్యోగులను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారని, సీపీఎస్ రద్దు అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. డిఏలు లేవని, కొందరు ఉద్యోగులకు జీతాలే అందడం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పలకరని, ఆర్థిక మంత్రి దొరకరని ఎద్దేవా చేశారు. ఇక ఉద్యోగుల సమస్యలు వినేదెవరని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద ఎందుకు పోరాడలేకపోతున్నారో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని విధాలా సహకరించిందని అశోక్ బాబు అన్నారు. 

Updated Date - 2020-03-19T20:44:01+05:30 IST