అమరావతి: ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఆర్టీసీ షాక్
ABN , First Publish Date - 2020-06-25T13:52:25+05:30 IST
అమరావతి: ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఆర్టీసీ షాక్

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి అధికారులు షాక్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ముగిసిందని...నేటి నుంచి విధులకు రావొద్దంటూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లాయి. అయితే ఉద్యోగులను తొలగించబోమని గతంలో చెప్పిన మంత్రి పేర్ని నాని మంత్రి మాటకు విలువ లేకుండా పోయిందని ఔట్సోర్సింగ్ సిబ్బంది వాపోయారు. ఈ నిర్ణయంతో దాదాపు 7800 మంది ఔటర్సోర్సింగ్ సిబ్బందిలో ఆందోళన నెలకొంది.