సుప్రీం కోర్టులో ఏపీ ఎన్నికల సంఘానికి చుక్కెదురు

ABN , First Publish Date - 2020-06-18T21:41:36+05:30 IST

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.

సుప్రీం కోర్టులో ఏపీ ఎన్నికల సంఘానికి చుక్కెదురు

న్యూఢిల్లీ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. గతంలో ఏపీ ప్రభుత్వానికి ఏ విధంగా ఊరట లభించలేదో.. అలాగే ఇప్పుడు ఎన్నికల కమిషన్‌కు కూడా న్యాయస్థానంలో ఊరట లభించలేదు. నిమ్మగడ్డను ఎస్ఈసీగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ తరఫున ఆ శాఖ కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. గతంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ రెండూ ఒకటే కావడంతో ఆ పిటిషన్‌లో ఉన్న ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ మెయిన్ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందో అప్పుడు విచారణ జరుగుతుందని పేర్కొంటూ స్టే ఇవ్వడానికి మాత్రం ధర్మాసనం నిరాకరించింది.

Updated Date - 2020-06-18T21:41:36+05:30 IST