అక్టోబరు 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం
ABN , First Publish Date - 2020-09-29T08:19:53+05:30 IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీని ఖరారు చేసింది. అక్టోబరు 6న
![అక్టోబరు 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలపై చర్చ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీని ఖరారు చేసింది. అక్టోబరు 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించడం, దాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడం వంటి పరిణామాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఈ సమావేశం రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.