గవర్నర్ను కలిసిన ఏపీ ఎస్ఈసీ రమేశ్.. సర్వత్రా ఆసక్తి
ABN , First Publish Date - 2020-03-16T16:23:04+05:30 IST
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ను ఎస్ఈసీ రమేష్కుమార్ కలిశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ను ఎస్ఈసీ రమేష్కుమార్ కలిశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు కారణాలపై వివరించారు. సుమారు అరగంటకుపైగా ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు వాయిదా వేస్తూ సీఈసీ తీసుకున్న నిర్ణయంపై ఆదివారం నాడు గవర్నర్కు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ రమేష్కుమార్ తీరుపై వ్యక్తిగత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ను ఎన్నికల కమిషనర్ కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల వ్యవహారంపై గవర్నర్-రమేశ్ కుమార్ ఏం నిర్ణయిస్తారనే విషయం తెలియరాలేదు.
ఇదిలా ఉంటే.. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఎన్నికల సంఘానికి ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈసీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని లేఖలో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చేపట్టవచ్చని సూచించారు. పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని సీఎస్ పేర్కొన్నారు. మరో 3, 4 వారాలు కరోనా అదుపులోనే ఉంటుందని స్పష్టం చేశారు.