చికాగో నుంచి ఏపీకి చేరుకున్న ఎన్ఆర్ఐలు
ABN , First Publish Date - 2020-05-17T22:00:10+05:30 IST
చికాగో నుంచి ఏపీకి చేరుకున్న ఎన్ఆర్ఐలు

విజయవాడ: వందే భారత్ మిషన్లో భాగంగా చికాగో నుంచి 31 మంది ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నారు. చికాగో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఎన్ఆర్ఐలు... ప్రత్యేక బస్సుల్లో ఎన్ఆర్ఐలువిజయవాడకు చేరుకున్నారు. ఎన్ఆర్ఐలకు కలెక్టర్ ఇంతియాజ్ స్వాగతం పలికారు. ప్రత్యేక బస్సుల్లో వారి సొంత జిల్లాల్లోని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ఏపీకి చెందిన ఎన్నారైల కోసం హైదరాబాద్లో ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేశారు.