పునరుద్ధరణ వేగవంతం:ఎస్పీడీసీఎల్
ABN , First Publish Date - 2020-11-27T09:22:46+05:30 IST
సదరన్ డిస్కం పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు సంస్థ సీఎండీ హెచ్.హరనాథరావు తెలిపారు.
![పునరుద్ధరణ వేగవంతం:ఎస్పీడీసీఎల్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తిరుపతి (ఆటోనగర్): సదరన్ డిస్కం పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు సంస్థ సీఎండీ హెచ్.హరనాథరావు తెలిపారు. కర్నూలు, అనంతపురం సర్కిళ్ల నుంచి 20 బృందాలను పిలిపించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పనులు వేగవంతం చేశామన్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామన్నారు.