ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది

ABN , First Publish Date - 2020-11-21T09:02:20+05:30 IST

‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 18 నెలల పాలనలో ఒక్క హామీ కూడా సమగ్రంగా నెరవేర్చలేదు’’ అని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు.

ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది

ఎంపీ రామ్మోహన్‌ నాయుడు


పలాస, నవంబరు 20: ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 18 నెలల పాలనలో ఒక్క హామీ కూడా సమగ్రంగా నెరవేర్చలేదు’’ అని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాసలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘అమరావతిని మూడు ముక్కలు చేసి రాజధాని లేకుండా చేశారు. పోలవరం ఎత్తును తగ్గించి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఉన్న పనులు నిలిచిపోగా... లిక్కర్‌, ఇసుక పాలసీ పేరుతో ప్రజలను సైతం మోసం చేసారు. అర్హులందరికీ నెలకు రూ.3 వేలు పింఛను ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకూ అమలు చేయలేదు’’ అని ప్రభుత్వం తీరుపై ఎంపీ మండిపడ్డారు.  

Updated Date - 2020-11-21T09:02:20+05:30 IST