క్షయ నివారణలో ఏపీకి రెండో స్థానం
ABN , First Publish Date - 2020-06-25T08:17:22+05:30 IST
క్షయ వ్యాధి నివారణ, నియంత్రణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ద్వితీయ స్థానం లభించింది.

అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): క్షయ వ్యాధి నివారణ, నియంత్రణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ద్వితీయ స్థానం లభించింది.కేంద్ర ప్రభుత్వం బుధవారం ఇండియా టీబీ రిపోర్టు 2020ని విడుదల చేసింది. మొత్తంగా దేశాన్ని 3 కేటగిరిలుగా విభజించారు. రాష్ట్ర జనాభా 50 లక్షలు పైన ఉన్న రాష్ట్రాలు మొదటి కేటగిరి, 50 లక్షల లోపు ఉన్న రాష్ట్రాలు రెండో కేటగిరి, కేంద్ర పాలిత ప్రాంతాలు మూడో కేటగిరి కాగా, ఏపీ మొదటి కేటగిరిలో రెండో స్థానంలో నిలిచింది.