ముగిసిన ఏపీ ఐసెట్.. నేడు కీ విడుదల
ABN , First Publish Date - 2020-09-12T09:32:50+05:30 IST
ముగిసిన ఏపీ ఐసెట్.. నేడు కీ విడుదల

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 11: రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా నిర్వహించిన ఏపీ ఐసెట్-2020 పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 64,890 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 51,991 మంది (80.12 శాతం) పరీక్షలకు హాజరైనట్లు ఏపీ ఐసెట్-2020 కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు. 15వ తేదీ దాకా విద్యార్థుల అభ్యంతరాలను స్వీకరిస్తామని ఆయన చెప్పారు.