కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా
ABN , First Publish Date - 2020-02-12T23:21:03+05:30 IST
రాజధాని పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కర్నూలుకు విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసుల తరలింపు, మిలీనియం టవర్స్కు రూ.19 కోట్లు విడుదల చేయడం, రాజధాని పనులు
![కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా](https://media.andhrajyothy.com/appimg/galleries/2020021205495973/02122020175029n94.jpg)
అమరావతి: రాజధాని పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కర్నూలుకు విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసుల తరలింపు, మిలీనియం టవర్స్కు రూ.19 కోట్లు విడుదల చేయడం, రాజధాని పనులు నిలుపుదల చేయడంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసనం.. కార్యాలయాల తరలింపునకు కారణాలు, స్థల వివరాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కు హైకోర్టు వాయిదా వేసింది.