నేరాలకు అడ్డాగా మారిన ఏపీ: కేశినేని
ABN , First Publish Date - 2020-08-16T08:32:50+05:30 IST
‘‘నేరాలకు ఏపీ అడ్డా గా మారింది. ఎప్పుడైతే జగన్ సీఎం అయ్యారో అప్పుడే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. విధ్వంసంతోనే జగన్ పాలన మొదలైంది’’ అని టీడీపీ ఎంపీ కేశినేని నాని...

న్యూఢిల్లీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ‘‘నేరాలకు ఏపీ అడ్డా గా మారింది. ఎప్పుడైతే జగన్ సీఎం అయ్యారో అప్పుడే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. విధ్వంసంతోనే జగన్ పాలన మొదలైంది’’ అని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. శనివారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసి విజయవాడలో నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.