జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
ABN , First Publish Date - 2020-08-13T02:48:14+05:30 IST
జూనియర్ డాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్ స్టైఫండ్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1 నుండి
అమరావతి: జూనియర్ డాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్ స్టైఫండ్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1 నుండి పెరిగిన స్టైఫండ్ అమలు కానుంది. వైద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం ఎవరెవరికి ఎంత స్టైఫండ్ అంటే..
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రూ.15,589
పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ.44,075
పీజీ సెకండియర్ విద్యార్థులకు రూ.46,524
పీజీ మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.48,973
పీజీ డిప్లొమా ఫస్టియర్- రూ.44,075, సెకండియర్- రూ.46,524
సూపర్ స్పెషాలిటీ ఫస్టియర్ విద్యార్థులకు రూ.48, 973
సూపర్ స్పెషాలిటీ సెకండియర్ విద్యార్థులకు రూ.51,422
సూపర్ స్పెషాలిటీ మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.53,869
ఎండీఎస్ ఫస్టియర్- రూ.44,075, సెకండియర్- రూ.46,524
ఎండీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.48,973 చొప్పున స్టైఫండ్ను ప్రభుత్వం ప్రకటించింది.