ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2020-10-01T19:01:17+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తుళ్లూరు మాజీ తహసీల్దార్‌ సుధీర్‌బాబు కేసులో స్టే ఎత్తేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వారంలోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది. వారంలోగా నిర్ణయం తీసుకోకపోతే తామే పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. అమరావతి ప్రాంతంలో అసైన్డ్‌ భూములు రిజిస్ట్రేషన్‌ చేశారన్న ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు జరగకుండా హైకోర్టు స్టే విధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated Date - 2020-10-01T19:01:17+05:30 IST