వైఎస్‌తో పాటు మరణించిన ఐఏఎస్‌ కుమార్తెకు కీలక పదవి

ABN , First Publish Date - 2020-05-30T02:15:17+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలో

వైఎస్‌తో పాటు మరణించిన ఐఏఎస్‌ కుమార్తెకు కీలక పదవి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలో ‘రచ్చబండ’కు వెళ్తూ 2009, సెప్టెంబరు 2న అప్పటి సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి హెలిక్టాపర్‌ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన ముఖ్యకార్యదర్శి డాక్టర్ సుబ్రహ్మణ్యం కూడా మరణించారు. దీంతో తన కుమార్తె సింధుకు ఉద్యోగం ఇవ్వాలంటూ సుబ్రహ్మణ్యం సతీమణి విజయకుమారి, సింధు 2017, మే 23న ప్రభుత్వాన్ని కోరారు. 


ఈ మేరకు శుక్రవారం రాత్రి పి.సింధును డిఫ్యూటి కలెక్టర్‌గా (గ్రూప్‌-1) నియమిస్తూ శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల నిబంధనలను అనుసరించి జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2017లోనే రావాల్సిన ఈ ఉద్యోగం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. అయితే న్యాయసలహా, లిటిగేషన్ల పేరిట ఇన్నాళ్లకు ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాలో ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌ పోస్టు ఇవ్వడం జరిగింది. త్వరలోనే కృష్ణా జిల్లా డిప్యూటీ కలెక్టర్‌‌గా సింధు విధులు నిర్వర్తించనున్నారు.



Updated Date - 2020-05-30T02:15:17+05:30 IST