ఏపీ బార్డర్కి ఎవరొచ్చినా 2 వారాల క్వారంటైన్: డీజీపీ సవాంగ్
ABN , First Publish Date - 2020-03-26T21:15:03+05:30 IST
అమరావతి: ఏపీ బార్డర్కి ఎవరొచ్చినా రెండు వారాలపాటు క్వారంటైన్కు పంపిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
అమరావతి: ఏపీ బార్డర్కి ఎవరొచ్చినా రెండు వారాలపాటు క్వారంటైన్కు పంపిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రెండు వారాల క్వారంటైన్ అనంతరమే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఆయన ప్రకటించారు. బయటి వ్యక్తలను ఏపీలోకి అనుమతించబోమని ఆయన వెల్లడించారు.
ఎక్కడివారు అక్కడే ఉండాలని కోరుతున్నామన్నారు. కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సవాంగ్ కోరారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వైరస్ సోకకుండా ఉండటానికే లాక్డౌన్ అని.. ఒకవేళ అనుమతిస్తే లాక్డౌన్ను ఉల్లంఘించినట్టేనని సవాంగ్ తెలిపారు. ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు.