ఏపీలో కొత్తగా 1,062 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-07-08T19:21:25+05:30 IST
ఏపీలో కొత్తగా 1,062కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు.
అమరావతి: ఏపీలో కొత్తగా 1,062కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. వీరిలో ఏపీకి చెందినవారు 1,051 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 9మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 22,259 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 264 మంది మృతి చెందారు. 10,894 మంది చికిత్సపొందుతుండగా, 11,101 మంది డిశ్చార్జ్ అయ్యారు.