సున్నా వడ్డీకే రుణాలిస్తాం: సీఎం జగన్
ABN , First Publish Date - 2020-02-08T19:21:01+05:30 IST
పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో ఎదగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

రాజమండ్రి: పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో ఎదగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిస్తామని.. త్వరలోనే ఈ పథకానికి శ్రీకారం చుడతామని సీఎం తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ పథకం ఉండేదని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నిలిపి వేసిందన్నారు. రాజమండ్రిలో జరిగిన మహిళా సదస్సులో మాట్లాడిన ఆయన సున్నా వడ్డీకే రుణాలు ప్రకటన చేశారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ల కోసం చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఏపీ నుంచే ఉద్భవించాలని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపు 18 దిశ పీఎస్లు అందుబాటులోకి వస్తాయని.. దిశ పీఎస్లలో అత్యధికంగా మహిళలే ఉంటారని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో మూడు ఫోరెన్సిక్ ల్యాబ్లు అందుబాటులోకి తెస్తామని.. దిశ చట్టం విషయంలో... రాష్ట్ర పరిధిలోని అన్ని అంశాలను నాలుగు నెలల్లో పూర్తిచేస్తామన్నారు.