5న ఢిల్లీకి ఏపీ సీఎం.. మోదీతో భేటీ?
ABN , First Publish Date - 2020-10-04T04:43:07+05:30 IST
ఈ నెల 5న సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు కేంద్రమంత్రులు ...

అమరావతి: ఈ నెల 5న సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు కేంద్రమంత్రులు సీతారామన్, షెకావత్ను కూడా జగన్ కలుస్తారని సమాచారం. ఏపీకి రావాల్సి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. పర్యటనలో భాగంగా పెండింగ్ ప్రాజెక్టుల అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.