ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
ABN , First Publish Date - 2020-03-04T20:45:05+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.
![ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020030403113364/03042020151442n65.jpg)
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక ఎన్నికలపై మంత్రులతో విడిగా సీఎం సమావేశం జరిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 24శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను.. అధికారులు ప్రభుత్వానికి అందించారు. 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా కేబినెట్లో చర్చించారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం, ఎన్పీఆర్పై ఈ కేబినెట్లో చర్చించారు.