12న మంత్రివర్గ సమావేశం
ABN , First Publish Date - 2020-02-08T10:08:45+05:30 IST
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 12న జరగనుంది.

సచివాలయం తరలింపుపై నిర్ణయం?
అమరావతి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 12న జరగనుంది. సీఎం జగన్ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో పాలన వికేంద్రీకరణపై చర్చించే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ రాజధానుల ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించడం.. శాసనమండలి దానిని సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించే అవకాశముందని అంటున్నాయి. విశాఖకు సచివాలయం తరలింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.