22 అంశాలతో ఏపీ కేబినేట్ ఎజెండా..
ABN , First Publish Date - 2020-07-15T17:26:01+05:30 IST
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. 22 అంశాలతో ఏపీ కేబినేట్ ఎజెండా రూపొందింది.
![22 అంశాలతో ఏపీ కేబినేట్ ఎజెండా..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020071511541497/07152020115543n58.jpg)
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. 22 అంశాలతో ఏపీ కేబినేట్ ఎజెండా రూపొందింది. రాష్ట్రంలో జిల్లాల పునర్వవస్థీకరణకు ఛీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటును ప్రతిపాదన... 25 జిల్లాలుగా పునర్వవస్థీకరించాలని సూచన... జిల్లాల ఏర్పాటులో వ్యయాన్ని తగ్గించే విధంగా అధ్యయనం చేయాలని విజ్ఞప్తి.. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక విద్యుత్ ఎగుమతి విధానంపై నిర్ణయం ప్రతిపాదన.. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ను ప్రోత్సహించడం ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు... పదివేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ల ద్వారా 9గంటల నిరంతరాయ విద్యుత్ వ్యవసాయానికి ఇచ్చే విదంగా ఏర్పాట్లు... రాయలసీమ కరువు నివారణ అభివృద్ది సంస్థ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు కోసం ప్రతిపాదన
.. గుంటూరు నగరంలోని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముస్లింలపై మోపిన అన్ని రకాల కేసులను ఉపసంహరించుకునేలా ప్రతిపాదన..
సీపీఎస్ ఉద్యమం సందర్భంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులపై మోపిన కేసుల ఉపసంహరణ ప్రతిపాదన.. వీటిన్నింటిపై కేబినెట్ మీటింగ్లో చర్చించనున్నారు.