యూపీకి ఒకటే రాజధాని.. ఏపీకి మూడా?: రామ్ మాధవ్

ABN , First Publish Date - 2020-08-11T18:04:54+05:30 IST

ఏపీ మూడు రాజధానుల అంశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మరోసారి స్పందించారు.

యూపీకి ఒకటే రాజధాని.. ఏపీకి మూడా?: రామ్ మాధవ్

అమరావతి: ఏపీ మూడు రాజధానుల అంశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మరోసారి స్పందించారు.  ప్రపంచంలో... దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ అంశంలో కేంద్రం తన పరిధిలో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ సమయంలో ఎలా ఉందో.. ఇప్పుడు రాష్ట్ర పరిధి అంశాలపై అలానే కేంద్రం ఉందన్నారు. అంటే దీనర్థం ప్రశ్నించకూడదని కాదని వ్యాఖ్యానించారు. నాలుగు రెట్లు ఉన్న యూపీకి ఒకటే రాజధానిగా లక్నో ఉందని.. అయినా అక్కడి నుంచి పరిపాలన సాగడం లేదా అని ప్రశ్నించారు. నాడు అమరావతి అవినీతిపై ప్రశ్నించామని.. ఇప్పుడు మూడు రాజధానుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అదే సమయంలో అమరావతి రైతులకు న్యాయం జరిగేలా మన పోరాటాలు ఉండాలన్నారు. ప్రస్తుతం ఆ విషయం కోర్టులో ఉన్న కారణంగా.. కాస్త వేచి చూడాలని తెలిపారు. రాష్ట్రంలో మూడు రాజధానులనేవి అవినీతికి ఆలవాలం కాకుండా.. అమరావతి రైతులకు నష్టం జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఉందన్నారు.


ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీతో ఎలా ఉండాలో.. రాష్ట్ర ప్రజల కోసం ఎలా పోరాటం చేయాలో కార్యకర్తలకు పలు సూచనలు చేస్తూ.. రాజధానులపై పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.  

Updated Date - 2020-08-11T18:04:54+05:30 IST