పీర్ల చావిడి వద్ద 10 మందికి మించొద్దు
ABN , First Publish Date - 2020-08-13T07:15:27+05:30 IST
పీర్ల చావిడి వద్ద 10 మందికి మించొద్దు
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): మొహరం పండుగ సందర్భంగా పీర్ల చావిడి వద్ద ముజావర్లు, ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీ సభ్యులు కలిపి పది మందికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ సూచించింది. కరోనా నేపథ్యంలో కొవిడ్-19 నిబంధనలను ముస్లిం సోదరులు తప్పకుండా పాటించాలని మైనార్జీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి మహమ్మద్ ఇలియాజ్ రిజ్వి ఉత్తర్వులు జారీచేశారు.