ఐదేళ్లలో ఏపీకి లక్షా 92వేల కోట్లు: కేంద్రం

ABN , First Publish Date - 2020-03-24T09:27:22+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల కాలంలో... 2015-16 నుంచి 2019-20 వరకు రూ. 192037.04 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ ...

ఐదేళ్లలో ఏపీకి లక్షా 92వేల కోట్లు: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల కాలంలో... 2015-16 నుంచి 2019-20 వరకు రూ. 192037.04 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. అందులో పన్నుల వాటా, గ్రాంట్లు కలిపి రూ. 175877.03 కోట్లు, ఏపీ విభజన చట్టం కింద చేసిన ఆర్థిక సాయంలో రూ. 16160.01 కోట్లు ఉన్నట్లు లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్తా ప్రభాకర్‌ రెడ్డి, వైసీపీ ఎంపీ వంగా గీత అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

Updated Date - 2020-03-24T09:27:22+05:30 IST