ఏఎన్యూ పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2020-10-04T11:52:33+05:30 IST
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్ 7వ తేది నుంచి 14వ తేదీ వరకు జరిగిన పలు పీజీ పరీక్ష ఫలితాలను వర్సిటీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ వర్రపసాద మూర్తి, రిజిస్ర్టార్
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్ 7వ తేది నుంచి 14వ తేదీ వరకు జరిగిన పలు పీజీ పరీక్ష ఫలితాలను వర్సిటీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ వర్రపసాద మూర్తి, రిజిస్ర్టార్ ఆచార్య కె.రోశయ్య శనివారం విడుదల చేశారు. ఎంఏ ఎకనామిక్స్, రూరల్ డెవలప్మెంట్, హిందీ, ఎంహెచ్ఆర్ఎం, ఎన్హెచ్ఈ, స్టాటిస్టిక్స్, జియాలజి పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్ష నిర్వహణాధికారి సీహెచ్ ఉషారాణి తెలిపారు. ఈ నెల 13వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రతి పేపరుకు రూ.1,225 చొప్పున ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. పీజీ కోఆర్డినేటర్ డాక్టర్ అనిత, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.