అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం
ABN , First Publish Date - 2020-09-06T15:24:33+05:30 IST
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రథం పూర్తిగా దగ్ధమైంది. ఆలయ ప్రాంగాణంలో ఉంటున్న ఈ రథానికి 60 ఏళ్ల చరిత్ర ఉంది.
![అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020090609384468/09062020095408n34.jpg)
రాజమండ్రి: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రథం పూర్తిగా దగ్ధమైంది. ఆలయ ప్రాంగాణంలో ఉంటున్న ఈ రథానికి 60 ఏళ్ల చరిత్ర ఉంది. స్వామి వారి రథానికి మంటలు అంటుకోవడంపై ఆలయ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎవరైనా దుండగులు నిప్పంటించారా? లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.