తిరుమలలో జనసంచారం లేకపోవడంతో పెరిగిన జంతు సంచారం
ABN , First Publish Date - 2020-03-24T12:53:12+05:30 IST
తిరుపతి: తిరుమలలో జనసంచారం లేకపోవడంతో జంతువుల సంచారం పెరిగింది. రాత్రి సమయాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి.
తిరుపతి: తిరుమలలో జనసంచారం లేకపోవడంతో జంతువుల సంచారం పెరిగింది. రాత్రి సమయాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. నిన్న రాత్రి లింక్ రోడ్డుతో పాటు కళ్యాణ వేదిక, ముల్ల గుంటలో చిరుతలు సంచరించాయి. నారాయణ గిరి ఉద్యానవనం వద్ద ఎలుగుబంటి సంచరించినట్టు టీటీడీ అధికారులు గుర్తించారు. రాత్రి వేళలో ఘాట్ రోడ్డులో వాహనాలను టీటీడీ నిలపివేసింది. స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని విజిలెన్స్, పోలీస్ అధికారులు సూచించారు.