ఈజ్ ఆఫ్ డూయంగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్దే అగ్రస్థానం: మేకపాటి
ABN , First Publish Date - 2020-06-22T23:36:06+05:30 IST
ఆహార ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయంగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్దే అగ్రస్థానం ఉందని పేర్కొన్నారు.
అమరావతి: ఆహార ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయంగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్దే అగ్రస్థానం ఉందని పేర్కొన్నారు. వాణిజ్యానికి అయ్యే ఖర్చును మరింత తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నామని, ఆహార శుద్ది రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఏపీ కీలకమని, ఆహార ఉత్పత్తికి అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని మేకపాటి గౌతమ్రెడ్డి చెప్పారు.