అనంతపురం...వైద్య సిబ్బంది పట్ల అధికారుల నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-04-25T15:02:39+05:30 IST

అనంతపురం...వైద్య సిబ్బంది పట్ల అధికారుల నిర్లక్ష్యం

అనంతపురం...వైద్య సిబ్బంది పట్ల అధికారుల నిర్లక్ష్యం

అనంతపురం: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బంది పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించారు. కరోనా పాజిటివ్‌ కేసుతో  26 మంది  వైద్య సిబ్బంది కాంటాక్ట్‌ అయ్యారు. వైద్య సబ్బందిని క్వారంటైన్ కేంద్రంలో ఉండాలంటూ అధికారుల ఆదేశించారు. ఎలాంటి సౌకర్యాలు లేని క్వారంటైన్‌కు వారిని అధికారులు అర్థరాత్రి తరలించారు. అక్కడ ఉండలేమని ఉన్నతాధికారులకు వైద్య మహిళా సిబ్బంది మొరపెట్టుకున్నట్లు సమాచారం. రాత్రంతా క్వారంటైన్ కేంద్రాల చుట్టూ వైద్య సిబ్బందిని తిప్పారు. ఎట్టకేలకు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ క్వారంటైన్‌కు వారిని తరలించారు. జేఎన్టీయూ నుంచి సీనియర్ డాక్టర్లను ఓ లాడ్జికి తరలించారు. హోం క్వారంటైన్‌కు అనుమతించాలంటూ వైద్య సిబ్బంది వేడుకుంటున్నారు. దీంతో అధికారుల తీరుపై వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

Updated Date - 2020-04-25T15:02:39+05:30 IST