వైసీపీ నాయకుల వేధింపులతో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-12-04T01:31:43+05:30 IST
వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక టీడీపీ కార్యకర్త ఆనందరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు.

రాజమండ్రి: వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక టీడీపీ కార్యకర్త ఆనందరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన అనపర్తి మండలం పులగుర్త గ్రామంలో జరిగింది. అతని పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.