జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ అమరావతి జేఏసీ

ABN , First Publish Date - 2020-07-20T17:13:06+05:30 IST

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని దీక్షలు ఓవైపు..

జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ అమరావతి జేఏసీ

అమరావతి: ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని దీక్షలు ఓవైపు, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీయే రద్దు బిల్లులు ఆమోదించుకోవాలని మరోవైపు, భవిష్యత్ తరాలకోసం బిల్లులు ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖలు ఇంకొవైపు. ఇలా ఏపీలో బిల్లుల పంచాయితీ కొనసాగుతోంది. 215 రోజులుగా రైతులు, మహిళలు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికోసం చర్యలు తీసుకోవాల్సిందిపోయి వివాదాస్పద బిల్లులు ఆమోదం ఇప్పుడు ముఖ్యమా? అని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-07-20T17:13:06+05:30 IST