ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హత్య చేస్తారా?: అమరనాథ్ రెడ్డి

ABN , First Publish Date - 2020-12-29T20:04:32+05:30 IST

చిత్తూరు: ప్రొద్దుటూరు ఘటనపై మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి స్పందించారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హత్య చేస్తారా?: అమరనాథ్ రెడ్డి

చిత్తూరు: ప్రొద్దుటూరు ఘటనపై మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి స్పందించారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య బాధాకరమన్నారు. సీఎం సొంత జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హత్య చేస్తారా? అని అమరనాథ్ రెడ్డి ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలు, టీడీపీ వారిని హతమార్చడమే వైసీపీ అజెండానా? అని నిలదీశారు. ఇప్పటిదాకా జరిగిన హత్యలపై పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు. దోషులను చట్ట పరంగా శిక్షించి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అమరనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-29T20:04:32+05:30 IST