నాడు వైఎస్.. ఇప్పుడు జగన్..: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2020-03-03T01:23:17+05:30 IST
నాడు వైఎస్.. ఇప్పుడు జగన్..: అచ్చెన్నాయుడు

అమరావతి: బలహీనవర్గాల పట్ల నాడు వైఎస్.. ఇప్పుడు జగన్..కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పాదయాత్రలో జగన్ మాయమాటలు చెప్తే.. బలహీనవర్గాల్లో చీలిక వచ్చి వైసీపీకి ఓటేశారన్నారు. బీసీలకు లబ్ధిచేకూర్చే చంద్రన్న బీమా, పెళ్లికానుతో పాటు..అనేక పథకాలను రద్దు చేశారన్నారు. రిజర్వేషన్లను 50శాతానికి పరిమితం చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్ధమైన న్యాయవాదులతో సుప్రీంకు వెళ్లాలని సూచించారు.