మంత్రి బొత్సపై అమరావతి జేఏసీ ఆగ్రహం
ABN , First Publish Date - 2020-09-13T21:37:12+05:30 IST
మంత్రి బొత్సపై అమరావతి జేఏసీ ఆగ్రహం
![మంత్రి బొత్సపై అమరావతి జేఏసీ ఆగ్రహం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ పై అమరావతి జేఏసీ ఆగ్రహించింది. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని పదే పదే చెప్తూ బొత్స ఎందుకు నిరూపించలేకపోతున్నారని జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా గత ప్రభుత్వంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్తూ ఎందుకు బయటకు తీయలేకపోతున్నారని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్తూ అమరావతిపై ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తుందని ఆరోపించారు.