362వ రోజుకి చేరుకున్న రాజధాని గ్రామాల మహిళల నిరసనలు..
ABN , First Publish Date - 2020-12-13T15:55:21+05:30 IST
అమరావతి: రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 362వ రోజుకి చేరుకున్నాయి.

అమరావతి: రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 362వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు చెబుతున్నారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం కొనసాగుతోంది.