ఎన్టీఆర్ భవన్లో కోడెల ప్రథమ వర్థంతి...పాల్గొన్న టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2020-09-16T18:30:19+05:30 IST
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోడెలకు పార్టీ నేతలు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, తెలుగురైతు అధ్యక్షులు మార్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.