మూడు రాజధానుల ప్రకటన ఏపీకి మంచిది కాదు: డి.రాజా
ABN , First Publish Date - 2020-09-22T03:18:26+05:30 IST
సీపీఐ నేత డి.రాజాని అమరావతి మహిళా జేఏసీ నేతలు కలిశారు. రాజధాని అమరావతి అంశాన్నిఆయనకు వివరించారు. ఈ సందర్భంగా..
![మూడు రాజధానుల ప్రకటన ఏపీకి మంచిది కాదు: డి.రాజా](https://media.andhrajyothy.com/appimg/galleries/2020092109460420/09212020214819n20.jpg)
న్యూఢిల్లీ: సీపీఐ నేత డి.రాజాని అమరావతి మహిళా జేఏసీ నేతలు కలిశారు. రాజధాని అమరావతి అంశాన్నిఆయనకు వివరించారు. ఈ సందర్భంగా డి. రాజా మాట్లాడుతూ ‘‘అమరావతి కోసం రైతులు నిరంతరాయంగా పోరాడుతున్నారన్నారు. మూడు రాజధానుల ప్రకటన ఏపీకి మంచిది కాదని చెప్పారు. అమరావతి జేఏసీతో కలిసి సీపీఐ కూడా పోరాడుతుందని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా తాము కట్టుబడి ఉన్నామని డి.రాజా తెలిపారు.