-
-
Home » Andhra Pradesh » Amaravathi farmers protest
-
355వరోజుకు చేరిన అమరావతి రైతుల నిరసనలు
ABN , First Publish Date - 2020-12-06T16:03:05+05:30 IST
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజుకొక రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం నాటికి 355వ రోజుకు చేరుకుంది. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్ది ఆనాడు రాజధాని కోసం 30వేల ఎకరాలు కావాలని చెప్పారని, అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాజధానిగా అమరావతే కావాలని, రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ రైతులు నిరసనలు తెలుపుతున్నారు.