261వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు
ABN , First Publish Date - 2020-09-03T13:20:39+05:30 IST
రాజధాని అమరాతి కోసం రైతులు, మహిళల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

అమరావతి: రాజధాని అమరాతి కోసం రైతులు, మహిళల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నేటితో రైతులు చేపట్టిన నిరసనలు 261వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. మరోవైపు ఈ రోజు కాబినెట్ సమావేశం ఉండడంతో మందడం శిబిరంపై పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. కేబినెట్ అయ్యే వరకు శిబిరం నిర్వహించవద్దని నిన్ననే రైతులకు పోలీసులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.