అమరావతి ఉద్యమంలో ఆగిన మరో రైతు గుండె
ABN , First Publish Date - 2020-09-22T14:51:07+05:30 IST
అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. ప్రభుత్వం మూడు రాజధానులు నిర్ణయంతో అమరావతి తరలి పోతుందని ఆందోళన
అమరావతి: అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. ప్రభుత్వం మూడు రాజధానులు నిర్ణయంతో అమరావతి తరలి పోతుందని ఆందోళన చెందిన తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రైతు పారా సదాశివరావు(59) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి ఆయన రెండు ఎకరాల 25 సెంట్ల భూమిని ఇచ్చారు. రాజధానిపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆలోచిస్తూ సదాశివరావు ఆందోళన చెందేవారని స్థానికులు చెబుతున్నారు.