270వ రోజుకు రాజధాని రైతులు, మహిళల నిరసనలు
ABN , First Publish Date - 2020-09-12T13:48:23+05:30 IST
రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 270వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతి: రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 270వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతుల స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.