ఆలమట్టిలో ఆపేస్తున్నారు
ABN , First Publish Date - 2020-08-12T09:22:23+05:30 IST
కృష్ణానదికి వస్తున్న వరద ప్రవాహాన్ని కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి జలాశయంలో ఎక్కువగా నిల్వ చేస్తోంది. మంగళవారం ఆలమట్టిలోకి సుమారు 1.64 లక్షల క్యూసెక్కుల వరద

- ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్న కర్ణాటక
- నారాయణపూర్లోకి తగ్గనున్న కృష్ణా వరద
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్: కృష్ణానదికి వస్తున్న వరద ప్రవాహాన్ని కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి జలాశయంలో ఎక్కువగా నిల్వ చేస్తోంది. మంగళవారం ఆలమట్టిలోకి సుమారు 1.64 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ, దిగువకు 39 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేసింది. సోమవారం వరకు ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఎంత వరద వచ్చిందో, అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే మంగళవారం నుంచి నీటి విడుదలను తగ్గించారు. ఆలమట్టి పూర్తి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలు కాగా, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆలమట్టి నుంచి నీటి విడుదల తగ్గడంతో నారాయణపూర్ ప్రాజెక్టులోకి వచ్చే వరద నీరు కూడా తగ్గింది. మరోపక్క తుంగభద్రలోకి వచ్చే వరద కూడా తగ్గింది. శ్రీశైలం జలాశయానికి 1,47,890 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది.