టెలీ మెడిసిన్ సేవలో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ముందడుగు
ABN , First Publish Date - 2020-04-25T21:56:37+05:30 IST
గుంటూరు: టెలీ మెడిసిన్ సేవలో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన ‘పరామర్శ’ అనే యాప్ను ఎయిమ్స్ యాజమాన్యం రూపొందించింది.

గుంటూరు: టెలీ మెడిసిన్ సేవలో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన ‘పరామర్శ’ అనే యాప్ను ఎయిమ్స్ యాజమాన్యం రూపొందించింది. కరోనా కారణంగా డాక్టర్లు లేక ఇబ్బందులకు గురి అవుతున్న మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి ఏయిమ్స్ హాస్పటల్ సేవలు కొంత ఊరటనిస్తున్నాయి. ఇప్పటివరకు టెలీ మెడిసిన్ విధానంలో సెల్ ఫోన్ వీడియో చాట్ ద్వారా రోగులు.. డాక్టర్ల సలహాలు తీసుకుని మందులు వాడేందుకు దోహదపడుతుంది. డాక్టర్ల సలహాలు, సూచనలు కోసం తప్పని సరిగా ప్లే స్టోర్ లోకి వెళ్లి ఈ ‘పరామర్శ’ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.