‘నివర్’ బాధితులకు 500 చొప్పున సాయం
ABN , First Publish Date - 2020-12-06T08:31:20+05:30 IST
నివర్ తుఫాను బాధితులకు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): నివర్ తుఫాను బాధితులకు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున పరిహారం అందించాలని విపత్తు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 49,123 మందికి ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున అందించారు. విపత్తు నిధినుంచి రూ.2.45 కోట్లు విడుదల చేస్తూ విపత్తుల నిర్వహణశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.