అగ్రిగోల్డ్ చైర్మన్ ఇంట్లో ఈడీ సోదాలు
ABN , First Publish Date - 2020-03-04T18:40:15+05:30 IST
అగ్రిగోల్డ్ చైర్మన్ ఇంట్లో ఈడీ సోదాలు
అమరావతి: అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు ఇంట్లో బుధవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి సత్యనారాయణపురంలోని ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అగ్రిగోల్డ్ ఆస్తుల బదలాయింపులో అనుమానాల నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. కేంద్ర సాయుధ బలగాల సహకారంతో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.