జగన్ కేసుల విచారణ 27కు వాయిదా
ABN , First Publish Date - 2020-10-21T08:42:26+05:30 IST
సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ నెల 15న జరగాల్సిన విచారణను,

హైదరాబాద్ సిటీ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ నెల 15న జరగాల్సిన విచారణను, 20వ తేదీ వాయిదా వేయగా, మంగళవారం విచారణకు రావాల్సిన కేసులను మళ్లీ 27వ తేదీకి వాయిదా వేశారు. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ మధుసూదనరావు సెలవులో ఉండడంతోపాటు దసరా పండగ నేపథ్యంలో కేసుల విచారణను ఇన్చార్జి న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు. ఇదిలావుంటే, మెట్రో పాలిటన్ సెషన్ జడ్జి(ఎంఎ్సజే కోర్టు) పరిధిలో ఉన్న ఈడీ కేసు నవంబరు 9వ తేదీకి వాయిదా పడింది. కాగా, జగన్ కేసులు విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుకే ఈ కేసును కూడా బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ నవంబరు 5వ తేదీకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈడీ కేసును నవంబరు 9కి వాయిదా వేశారు. సీఎం జగన్కు సంబంధించిన అన్ని కేసులు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉండగా, ఈడీ కేసు మాత్రం ఎంఎ్సజే కోర్టు విచారణలో ఉంది.